బాధ్యత కలిగిన ప‌ద‌విలో ఉండి అలాంటి వ్యాఖ్య‌లు చేయడం స‌రికాద‌ని వ్యాఖ్య‌

byసూర్య | Fri, Oct 25, 2024, 03:07 PM

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్య‌ల‌ విషయంలో మంత్రి కొండా సురేఖపై నాంప‌ల్లి కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కేటీఆర్‌ దాఖలు చేసిన రూ.100 కోట్ల పరువునష్టం దావాను ఈరోజు న్యాయ‌స్థానం విచారించింది. విచార‌ణ‌లో భాగంగా బాధ్యత కలిగిన ప‌ద‌విలో ఉండి అలాంటి వ్యాఖ్య‌లు చేయడం స‌రికాద‌ని కోర్టు పేర్కొంది. అందులోనూ ఒక ప్ర‌జా ప్ర‌తినిధి నుంచి ఇలాంటి మాట‌లు రావ‌డం తీవ్ర అభ్యంత‌క‌రం అని తెలిపింది. అలాంటి వ్యాఖ్యలు సమాజంలో చెడు ప్రభావాన్ని చూపుతాయంది. మ‌రోసారి కేటీఆర్‌పై అలాంటి వ్యాఖ్య‌లు చేయ‌వ‌ద్ద‌ని హెచ్చ‌రించింది. ఆమె వ్యాఖ్యలను మీడియా, సోషల్‌ మీడియా, ఇతర ప్లాట్‌ఫామ్‌ల నుంచి వెంట‌నే తొలగించాలని న్యాయ‌స్థానం ఆదేశించింది. 


Latest News
 

రేపు బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించనున్న వేముల Fri, Oct 25, 2024, 08:01 PM
ఇక ఆ రూట్‌లో ప్రయాణించేవారికి నో టెన్షన్ Fri, Oct 25, 2024, 08:00 PM
కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 07:59 PM
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం Fri, Oct 25, 2024, 07:58 PM
కల్వకుర్తి: చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి Fri, Oct 25, 2024, 07:56 PM