యాదాద్రికి రైల్వే లైన్.. కేంద్రమంత్రి కీలక ప్రకటన

byసూర్య | Sun, Oct 20, 2024, 06:58 PM

ప్రతి రోజూ వేల మంది భక్తులు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని మెుక్కులు తీర్చుకుంటున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న యాదాద్రి పుణ్యక్షేత్రానికి నగరం నుంచి రోజు పది వేల మంది భక్తులు వెళ్తారని అంచనా. ప్రస్తుతం రోడ్డు మార్గంలోనే భక్తులు యాదాద్రి పుణ్యక్షేత్రానికి వెళ్తున్నారు. నగరంలో విపరీతమైన ట్రాఫిక్‌ సమస్య కారణంగా గంటన్నర పాటు నగరం దాటేందుకు సమయం పడుతోంది. నగరం దాటిన తర్వాత మరో రెండు రెండు గంటలు. మెుత్తంగా నాలుగైదు గంటలు ప్రయాణానికే పోతుంది. ఇక బస్సుల్లో, ప్రైవేట్‌ వాహనాల్లో అధిక మొత్తం ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దాంతో పాటు సమయం కూడా ఎక్కువగా పడుతోంది.


ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి యాదాద్రి వెళ్లేవారికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీపి కబురు చెప్పారు. యాదాద్రి వరకు ప్రత్యేక రైల్వే లైన్ నిర్మించి ఎంఎంటీఎస్‌ను పొడిగిస్తామని చెప్పారు. అందుకు సంబంధించిన టెండర్లు పూర్తి అయ్యాయని అన్నారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. అమృత్ పథకం కింద రూ.450 కోట్లతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను నేడు కిషన్ రెడ్డి సందర్శించారు.


చర్లపల్లి టెర్మినల్ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని.. తర్వలోనే ప్రధాని మోదీ స్టేషన్‌ను ప్రజలకు అంకితం చేస్తారని చెప్పారు. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు సైతం వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు. యాదాద్రితో పాటుగా కొమురవెల్లి మల్లన్న ఆలయానికి సమీపంలో నూతన రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతుందన్నారు. అది కూడా పూర్తి అయితే యాదాద్రికి, కొమురవెల్లికి ప్రత్యేక ట్రైన్లు నడుస్తాయని కిషన్ రెడ్డి వెల్లడించారు.


కాగా, యాదాద్రికి ఎంఎంటీఎస్ ట్రైన్లు నడపాలని భక్తులు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎంఎంటీఎస్ రెండోదశ పనులు కొనసాగుతున్నాయి. ఎంఎంటీఎస్ ట్రైన్లు యాదాద్రి సమీపంలోని రాయగిరి స్టేషన్‌ వరకు పొడగించాలని గత ఏడేళ్ల క్రితమే నిర్ణయించారు. ప్రస్తుతం మౌలాలి నుంచి ఘట్‌కేసర్‌ వరకు ఎంఎంటీఎస్ ట్రైన్లు ఉండగా.. అక్కడి నుంచి యాదాద్రికి కొత్తగా మూడో లైను వేయాల్సి ఉంది. ఆయితే టెండర్ ప్రక్రియ ఆలస్యం కావటంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు.


కొన్ని నెలల క్రితం ఘట్‌కేసర్- రాయగిరి రైల్వేలైన్ పూర్తి చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం మౌలాలి నుంచి ఘట్‌కేసర్‌ వరకు 21 కిలోమీటర్ల మేర కొత్తగా రెండు ఎంఎంటీఎస్ లైన్లు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఘట్‌కేసర్ నుంచి మరో 35 కిలోమీటర్ల మేర కొత్త లైను వేస్తే హైదరాబాద్ నగరం నుంచి కేవలం రూ.20 టిక్కెట్‌తో యాదాద్రి ఆలయానికి చేరుకునే అవకాశం ఉంటుంది. అది కూడా గంటలోపే ప్రయాణం చేయవచ్చు.


Latest News
 

ప్రజలను మోసం చేయడమేనా కాంగ్రెస్ ప్రజా పాలన Mon, Oct 21, 2024, 04:22 PM
సిరి సంపదలు ఇచ్చే దైవం అయ్యప్ప స్వామి... ఎమ్మెల్యే కేపీ వివేకానంద్.. Mon, Oct 21, 2024, 04:17 PM
మాటల ప్రభుత్వమే చేతల ప్రభుత్వం కాదు Mon, Oct 21, 2024, 04:14 PM
రైతు భరోసా చెల్లించాలని బి ఆర్ ఎస్ నిరసన Mon, Oct 21, 2024, 04:08 PM
సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే కవ్వంపల్లి Mon, Oct 21, 2024, 04:04 PM