సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే కవ్వంపల్లి

byసూర్య | Mon, Oct 21, 2024, 04:04 PM

రాష్ట్రంలో తొమ్మిది విశ్వవిద్యాలయాల కులపతుల నియామకాల్లో ఎస్సీ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మానకొండూరు శాసనసభ్యులు డా. కవ్వంపల్లి సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా సీఎం కు శాలువా కప్పి పుష్పగుచ్చం అందించారు.ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా వైస్ ఛాన్సలర్ల నియామకాల్లో  దళితులకు చోటు కల్పించలేదని, ఆ లోటును భర్తీ చేయడమే కాకుండా ఎస్సీ లకు అధిక  ప్రాధాన్యత ఇవ్వడంతో దళిత జాతి గర్వ పడుతోందంటూ ఎమ్మెల్యే కవ్వంపల్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖామాత్యులు పొన్నం ప్రభాకర్ సమక్షంలో పొగడ్తలతో ముంచెత్తారు.


Latest News
 

రైతు భరోసా అందించాలని బిఆర్ఎస్ ధర్నా Mon, Oct 21, 2024, 05:29 PM
బుగ్గార మండలం గ్రామాల్లో పలువురిని పరామర్శించిన MLA విప్ Mon, Oct 21, 2024, 04:36 PM
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. Mon, Oct 21, 2024, 04:32 PM
బుగ్గారం ఎక్స్ రోడ్ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించిన BRS నాయకులు Mon, Oct 21, 2024, 04:30 PM
పిఈటి జిల్లా టాపర్ అంకం శేఖర్ కు ఘనసన్మానం Mon, Oct 21, 2024, 04:24 PM