byసూర్య | Sat, Oct 19, 2024, 03:27 PM
మెట్ పల్లి పట్టణంలోని 20వ వార్డులలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాన్ని ఆపాలని కోరుతూ కమిషనర్ మోహన్ కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఫిర్యాదు దారులు మాట్లాడుతూ మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా 20వ వార్డులో చేపడుతున్న నిర్మాణాన్ని అడ్డుకోవాలని గతంలో మున్సిపల్ అధికారులకు వినతి పత్రం సమర్పించినా వారు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులు స్పందించకపోవడంతో మరోసారి మున్సిపల్ కమిషనర్ తో పాటు ఆర్డీవో, జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేస్తున్నామని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవాలని ఫిర్యాదు దారులు డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో 8,9,10,20వ వార్డులకు చెందిన నాయకులు వుజగిరి శ్రీనివాస్, సుధాకర్, ప్రసాద్, శేఖర్, కృష్ణ, బాబు, తేజ, నరేష్, కళ్యాణ్ తదితరులు ఉన్నారు.