అక్రమ నిర్మాణంపై కమిషనర్ కు ఫిర్యాదు

byసూర్య | Sat, Oct 19, 2024, 03:27 PM

మెట్ పల్లి పట్టణంలోని 20వ వార్డులలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాన్ని ఆపాలని కోరుతూ కమిషనర్ మోహన్ కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఫిర్యాదు దారులు మాట్లాడుతూ మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా 20వ వార్డులో చేపడుతున్న నిర్మాణాన్ని అడ్డుకోవాలని గతంలో మున్సిపల్ అధికారులకు వినతి పత్రం సమర్పించినా వారు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులు స్పందించకపోవడంతో మరోసారి మున్సిపల్ కమిషనర్ తో పాటు ఆర్డీవో, జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేస్తున్నామని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవాలని ఫిర్యాదు దారులు డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో 8,9,10,20వ వార్డులకు చెందిన నాయకులు వుజగిరి శ్రీనివాస్, సుధాకర్, ప్రసాద్, శేఖర్, కృష్ణ, బాబు, తేజ, నరేష్, కళ్యాణ్ తదితరులు ఉన్నారు.


Latest News
 

ఆందోళనలతో దద్దరిల్లిన ముత్యాలమ్మ టెంపుల్ ప్రాంగణం Sat, Oct 19, 2024, 05:08 PM
బండిసంజయ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు Sat, Oct 19, 2024, 05:03 PM
గంగాధర మండలంలో ఐకెపి కేంద్రాలు ప్రారంభించిన మేడిపల్లి సత్యం Sat, Oct 19, 2024, 04:59 PM
స్కాలర్ షిప్ లు ప్రభుత్వం భిక్ష కాదు Sat, Oct 19, 2024, 04:57 PM
బాధిత కుటుంబానికి సీఎం సహాయనిధి చెక్ అందజేసిన ఎమ్మెల్యే Sat, Oct 19, 2024, 04:54 PM