ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కి కృషి చేయాలి

byసూర్య | Fri, Oct 18, 2024, 10:27 PM

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. మండలం లోని కాన్గల్ లో ప్రాథమికొన్నత పాఠశాలలో మాజీ వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి సహకారం తో విద్యార్థులకు క్రీడా దుస్తులు, మండల పరిషత్ నిధులతో ఏర్పాటు చేసిన వైకుంఠ రథం, ప్రీజర్ ను,పెద్ద మాసాన్ పల్లి లో పాఠశాలలో బి ఆర్ ఎస్ యువ నాయకుడు పన్యాల ప్రవీణ్ రెడ్డి సహకారంతో విద్యార్థుల కు క్రీడా దుస్తులను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పంపిణీ చేశారు..
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధి కోసం మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ప్రైవేటు మోజు తో ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందని విచారం వ్యక్తం చేశారు. కాన్గల్ పాఠశాలల్లో పారిశుధ్యం లోపించడం పట్ల ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు.. ఇలాంటి సమస్యలు పునరావృతం అయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పాఠశాలల్లో  విద్యార్థుల సంఖ్య పెంచాలని, తనవంతుగా సహకారం అందిస్తామన్నారు. పాఠశాల ఉపాద్యాయులను ఆయన సన్మానించారు.


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM