గ్యాస్ లీకేజ్ పై చర్యలు శూన్యం..?

byసూర్య | Fri, Oct 18, 2024, 10:24 PM

సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని గొడ్రియాల గ్రామ శివారులో ఉన్న పంట పొలాల నుండి గ్యాస్ పైప్ లైన్ వేయడంతో వచ్చిన భారీ వర్షానికి పాలేరు వాగు ఉదృతంగా ప్రవహించడంతో పంట పొలాల్లో ఉన్న గ్యాస్ పైపులు పైకీ తేలడంతో అత్యంత ప్రమాదకరంగా మారిందని రైతు బజార్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... పంట పొలాల్లో కూలి పనులకు వచ్చేవాళ్లు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. జెసిబి లు ట్రాక్టర్లు ఎవరు కూడా దగ్గరకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుత్తేదారులు కూడా స్పందించకుండా కాలక్షేపం చేస్తున్నారని, అధికారులు స్పందించకుండా కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి లీకైన పైపులను మరమత్తులు చేసి పూడ్చాలని అధికారులను కోరారు.


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM