byసూర్య | Fri, Oct 18, 2024, 01:48 PM
హిందూ దేవుళ్లు, దేవాలయాలపై దాడులు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ శుక్రవారం విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్, లోకాయపల్లి లక్ష్మమ్మ ట్రస్ట్ సభ్యులు నారాయణపేట సీఐ శివశంకర్ కు వినతి పత్రం అందించారు. నారాయణపేట పరిసర ప్రాంతాల్లోని ఆలయాలకు భద్రత కల్పించాలని కోరారు. దాడులకు నిరసనగా రేపు పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు విశ్వహిందూ పరిషత్ కార్యదర్శి ప్రవీణ్ తెలిపారు.