సమాజంలో కవులు, కళాకారుల పాత్ర కీలకం

byసూర్య | Fri, Oct 18, 2024, 03:00 PM

విజ్ఞానవంతులుగాచేసేందుకు కవులు, కళాకారుల పాత్ర కీలకమైనదని  శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని నల్లగండ్ల హుడా కాంప్లెక్స్ లో శేరిలింగంపల్లి సాహితీ , సాంస్కృతిక కళా సేవా సమితి  ఆధ్వర్యంలో  గురువారం కవి సమ్మేళనం, కవుల ఇష్టా గోష్టి కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సమాజంలో ప్రజలను అన్ని రంగాల్లోనూ చైతన్యవంతం చేసేందుకు కవులు కళాకారులు రచయితలు ప్రముఖ పాత్ర వహించడం జరుగుతుందన్నారు.
అనంతరం  శేరిలింగంపల్లి సాహితీ సాంస్కృతిక కళా సేవా సమితి గౌరవ అధ్యక్షురాలు ట్యాగ్ లైన్ కింగ్ డాక్టర్ ఆలపాటి సభాద్యక్షులుగా  వ్యవహరించగా  అధ్యక్షులు మోటూరి నారాయణరావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవీంద్ర బాబు అరవా ఆధ్వర్యంలో కవుల ఇష్టాగోష్టి కార్యక్రమం జరిగింది.అనంతరం కవులను జగదీశ్వర్ గౌడ్ సత్కరించారు.ఈ సమావేశంలో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనుల శాఖ విశ్రాంత డైరెక్టర్ డాక్టర్ వి.డి.రాజగోపాల్ , ప్రముఖ పారిశ్రామికవేత్త వినోద్ గౌడ్,ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు తాడిబోయిన రామస్వామి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

జీవో 29ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ Fri, Oct 18, 2024, 05:12 PM
స్వయం సహాయ సంఘాల సభ్యులకు రూ.2 లక్షలు ఇస్తున్నామన్న సీతక్క Fri, Oct 18, 2024, 04:44 PM
అనివార్య కారణాల వల్ల కేటీఆర్ హాజరు కాలేకపోయారన్న న్యాయవాది Fri, Oct 18, 2024, 04:42 PM
రేపు ఉదయం తొమ్మిది గంటలకు మూసీ పరీవాహక ప్రాంతం వద్దకు వెళ్దామన్న హరీశ్ రావు Fri, Oct 18, 2024, 04:41 PM
పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓ వ్యక్తి అక్కడే ఒంటిపై పెట్రోల్ పోసుకొని .. Fri, Oct 18, 2024, 04:32 PM