byసూర్య | Fri, Oct 18, 2024, 03:05 PM
అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్ గ్రామం శివారు ప్రాంతాల్లో శ్రీశైలం వెళ్తున్న భక్తుడు అదృశ్యం అయ్యాడు అమ్రాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంమాడెం ఈదయ్య తండ్రి పెద్దయ్య, కులంయాదవ్, వయసు 34 సంవత్సరాలు, R/o షేర్ పల్లి, వర్త్య తండా దేవరకొండ, మండలం, నల్లగొండ జిల్లా,ఈ నెల 14వ తేదిన తమ ఊరి నుండి అప్పాజీ బైక్ పై శ్రీశైలం దర్శనానికి బయలుదేరి మన్ననూర్ గ్రామ సమీపంలో దారా బేస్ క్యాంప్ దగ్గర్లో తన బైక్, హెల్మెంట్ ,మొబైల్ ఫోన్, జర్కిన్ , వాటర్ బాటిల్ బ్యాగ్ పడి ఉన్నాయి.
అతని కోసం కుటుంబ సభ్యులు పోలీస్ వారు వెతికి నప్పటి కికనబడడం లేదు కావున చుట్టుపక్కల గ్రామాల వారు గాని, పశువుల కాపరులు గాని, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గాని, దయచేసి అతని గురించి ఏమైనా సమాచారం తెలిసి ఉంటే ఈ క్రింది ఫోన్ నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు అచ్చంపేట సీఐ 8712657731, అమ్రాబాద్ ఎస్ఐ 8712657740,రాందాస్ కానిస్టేబుల్ 9441918282.