రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదని ఎద్దేవా : రాజయ్య

byసూర్య | Wed, Oct 16, 2024, 07:55 PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పిచ్చిపట్టిన వ్యక్తిలా మాట్లాడుతున్నారని, ఆయన మాట్లాడేది ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ... సీఎం అజ్ఞానిలా మాట్లాడుతున్నారన్నారు. దిల్‌సుఖ్ నగర్‌లో విమానాలు కొనడానికి దొరుకుతున్నాయని ఒకసారి అంటారని, హైదరాబాద్‌‌కు మూడు వైపులా సముద్రం ఉంటుందని మరోసారి అంటారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందన్నారు. ఆయన తెలివి ఉండి మాట్లాడుతున్నారా? తెలివి లేక మాట్లాడుతున్నారా? అని విమర్శించారు. పాలనపై పట్టులేక పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా దాటవేత ధోరణి అవలంభిస్తున్నారని వ్యాఖ్యానించారు


.


Latest News
 

రేపు బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించనున్న వేముల Fri, Oct 25, 2024, 08:01 PM
ఇక ఆ రూట్‌లో ప్రయాణించేవారికి నో టెన్షన్ Fri, Oct 25, 2024, 08:00 PM
కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 07:59 PM
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం Fri, Oct 25, 2024, 07:58 PM
కల్వకుర్తి: చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి Fri, Oct 25, 2024, 07:56 PM