byసూర్య | Wed, Oct 16, 2024, 07:56 PM
అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వాడుతూ కేటుగాళ్లు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి అన్నారు. బుధవారం మక్తల్ లో ప్రజలకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. సైబర్ మోసంలో ఆర్థికంగా నష్టపోతే ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అన్నారు. అపరిచిత వ్యక్తులకు బ్యాంకు ఖాతా, ఏటీఎం, ఓటీపీ నంబర్లు ఇవ్వకూడదని సూచించారు.