byసూర్య | Mon, Sep 30, 2024, 03:47 PM
పాలమూరు ఉమ్మడి జిల్లాలో దౌల్తాబాద్ మండలంలో సోమవారం తీవ్ర విషాదం నెలకొంది. అంత్యక్రియలకు వెళ్తూ ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటనలో ఒకరు మృతి చెందగా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.
దౌల్తాబాద్ మండలం నుంచి అంత్యక్రియల కోసం వెళ్తుండగా దేవరఫసలవాద్ సమీపంలో అదుపు తప్పి ఈర్లపల్లి గ్రామానికి చెందిన ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.