రేపు ఉదయం మల్లికార్జున ఖర్గేను పరామర్శించనున్న సీఎం

byసూర్య | Mon, Sep 30, 2024, 10:02 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రేపు ఢిల్లీలో ఆయన బిజీబిజీగా గడపనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పరామర్శ, ఆ తర్వాత పార్టీ ముఖ్య నేతలతో సమావేశం ఇలా మంగళవారం నాడు ఢిల్లీలో బిజీగా ఉండనున్నారు.జమ్ము కశ్మీర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా మల్లికార్జున ఖర్గే స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. రేపు ఉదయం ఆయనను ముఖ్యమంత్రి పరామర్శిస్తారు. ఆ తర్వాత కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీ అవుతారు. హైదరాబాద్‌లో హైడ్రా, మూసీ ప్రక్షాళన అంశాలపై ప్రభుత్వంపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. నిర్వాసితులూ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా, మూసీ ప్రక్షాళనకు సంబంధించి అన్ని వివరాలను అధిష్ఠానానికి వివరించనున్నారు.


Latest News
 

హైడ్రాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని రంగనాథ్ వ్యాఖ్య Mon, Sep 30, 2024, 10:04 PM
రేపు ఉదయం మల్లికార్జున ఖర్గేను పరామర్శించనున్న సీఎం Mon, Sep 30, 2024, 10:02 PM
పత్తి డబ్బుల చెల్లింపులకు ప్రత్యేక యాప్.. అన్నదాతకు ఆ టెన్షన్ లేదు Mon, Sep 30, 2024, 09:10 PM
రేషన్ కార్డుల దారులకు ఈ కేవైసీ,,,డిసెంబర్ 31 వరకు గడువు పొడగింపు Mon, Sep 30, 2024, 09:06 PM
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు Mon, Sep 30, 2024, 08:59 PM