byసూర్య | Thu, Sep 26, 2024, 02:39 PM
పరువు నష్టం కేసులో శివసేన(UBT) కీలక నేత సంజయ్రౌత్కు 15 రోజులు జైలు శిక్ష విధిస్తూ ముంబై కోర్టు తీర్పు వెలువరించింది. మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 500 కింద రౌత్ను దోషిగా నిర్ధారించింది.
ఆయనకు రూ.25 వేలు జరిమానాతో పాటు 15 రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పునిచ్చింది. బీజేపీ నేత కిరీట్ సోమయ్య భార్య మేధ సోమయ్య దాఖలు చేసిన పరువునష్టం కేసులో కోర్టు ఈ తీర్పునిచ్చింది.