byసూర్య | Thu, Sep 26, 2024, 12:39 PM
పురుషులకు దీటుగా పేకాట ఆడుతున్న మహిళలను పోలీసులు అరెస్టు చేయడం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. వివరాల్లోకి వెళ్తే..నిజామాబాద్ జిల్లా సరస్వతీ నగర్లోని నీలోఫర్ హాస్పిటల్ నాలుగో అంతస్థులో డబ్బులు పెట్టి పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడులు చేపట్టారు. నలుగురు పేకాట రాణులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.15 వేల నగదుతో పాటు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే పట్టుబడ్డ మహిళలంతా ప్రముఖ వైద్యుల సతీమణులని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.