మూసీ నది ప్రక్షాళన ఆపరేషన్ షురూ

byసూర్య | Wed, Sep 25, 2024, 12:10 PM

మూసీ నది ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటామని చెప్పిన ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా మరో కీలక ముందడుగు వేసింది.గోల్నాక, చాదర్ ఘాట్, మూసారంబాగ్ లో ఉన్న ఆక్రమణలను తొలగిచేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ శని, ఆదివారాలలో మూసీ నది ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేయబోతున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లలో ఉన్న ఇళ్లను మార్క్ చేసిన హైడ్రా.. ఈ క్రమంలో 1350 మందికి తాజాగా హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఇవాళ మూసీ నివాసిత ప్రాంతాలకు మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్లు వెళ్లనున్నారు. అక్కడ ప్రజలను ఒప్పించి ఇళ్లను ఖాళీ చేయించేలా వారితో చర్చలు జరపనున్నారు.


మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో నిర్వాసితుల వివరాలు సేకరించేందుకు బుధవారం నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చజల్ జిల్లా కలెక్టర్లు, అధికారుల బృందం ఇంటింటికి వెళ్లి వివరాలు సకరిచనున్నారు. తొలి విడతలో భాగంగా మూసీ రివర్ బెడ్ లో ఉని 1600 ఇళ్లను తొలగించబోతున్నారు.


Latest News
 

క్రీడాకారులకు భోజన సదుపాయం Wed, Sep 25, 2024, 02:49 PM
రెండు రోజుల్లో రైతులకు పరిహారం: మంత్రి తుమ్మల Wed, Sep 25, 2024, 02:29 PM
నూతన ఫైర్ ఇంజన్ వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే Wed, Sep 25, 2024, 02:26 PM
షాద్ నగర్ లో ఏపీ మాజీ సీఎం దిష్టిబొమ్మ దగ్ధం Wed, Sep 25, 2024, 02:25 PM
ఆక్రమణలు తొలగిస్తున్న రాజన్న ఆలయ ఈవో వినోద్ రెడ్డి Wed, Sep 25, 2024, 02:24 PM