byసూర్య | Wed, Sep 25, 2024, 12:19 PM
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని మారుమూల గ్రామం వెల్గీలో గల గిరిజన ఆశ్రమ పాఠశాలను ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా మంగళవారం తనిఖీ చేశారు.
సమీపంలోని వాగుపై వంతెన లేకపోవడంతో స్థానికులు ఎడ్లబండి సాయంతో పీవోను వాగు దాటించారు. పీవో పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించి, మెనూ ప్రకారం వడ్డిస్తున్నారా లేదా అని ఆరా తీశారు.