byసూర్య | Wed, Sep 25, 2024, 12:27 PM
తెలంగాణలో బీసీ ప్రభుత్వ సాధనే లక్ష్యంగా సోమవారం హైదరాబాద్ లో బీసీ రాజకీయ చైతన్య వేదిక నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ నాయకులు ఈ సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు.ఈ భేటీలో బీసీల సాధికారిత, రాజ్యాధికారం, పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం, అనుసరించాల్సిన విధానాలు తదితర అంశాలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికపై సుదీర్ఘంగా చర్చకు వచ్చాయి. బీసీలందరూ ఏకతాటిపై నిలబడి జనాభా లెక్కింపు, రిజర్వేషన్ల పెంపు కోసం తెగించి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పలువురు బీసీ నాయకులు పిలుపునిచ్చారు.ఈ సమావేశానికి కాసాని వీరేష్ ముధిరాజ్, తీన్మార్ మల్లన్న (ఎమ్మెల్సీ), చిరంజీవి (ఐఏఎస్ రిటైర్డ్), చెరుకు సుధాకర్, సుందర్ రాజ్, జనార్దన్ గౌడ్ తదితరులు హాజరయ్యారు.