ఆర్డీవో వెంకట రెడ్డి ఆధ్వర్యంలో మూసీనదిని పరిశీలించిన అధికారులు

byసూర్య | Wed, Sep 25, 2024, 06:17 PM

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్ వద్ద మూసీ నదిలో నిర్మాణాలను అధికారులు పరిశీలించారు. ఆర్డీవో వెంకటరెడ్డి ఆధ్వర్యంలో అధికారులు మూసీనదిని పరిశీలించారు. అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి అక్రమ నిర్మాణాలను పరిశీలించారు. నివాసాలు, దుకాణాల అనుమతుల వివరాలు సేకరిస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని నిర్వాసితులకు ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న 16 వేల ఇళ్లను మూసీ నిర్వాసితులకు ఇచ్చేలా నిన్న ప్రభుత్వం జీవోను జారీ చేసింది. కొన్ని నెలలుగా 3 జిల్లాల పరిధిలోని మూసీ నదిపై సర్వే జరిగింది. రెవెన్యూ అధికారులు నది గర్భంలో, బఫర్ జోన్‌లో 10,200 నిర్మాణాలను గుర్తించారు. ఆ నిర్మాణాల్లో ఎవరెవరు ఉన్నారో గుర్తించేందుకు అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు


Latest News
 

కలల సౌధాలు క్షణాల్లోనే నేలమట్టం,,,సామాన్యుల కంటతడే Wed, Sep 25, 2024, 08:49 PM
జంతు వ్యర్థాలతో నెయ్యి, నూనెలు.. ఒళ్లు గగుర్పాటుకు గురిచేసేలా తయారీ Wed, Sep 25, 2024, 08:46 PM
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Wed, Sep 25, 2024, 08:45 PM
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు Wed, Sep 25, 2024, 08:45 PM
త్వరలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ.. మంత్రి తుమ్మల Wed, Sep 25, 2024, 08:44 PM