byసూర్య | Wed, Sep 25, 2024, 12:30 PM
కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ సన్నిధానంలో బుధవారాన్ని పురస్కరించుకుని భక్తి శ్రద్ధలతో పీఠపూజ నిర్వహించారు. పిన్నూరి మల్లికార్జున్, గురు స్వామి నేతృత్వంలో గణపతి, కుమార స్వామి, అయ్యప్పస్వామి చిత్రపటాలను శుద్ధి చేసి అష్టోత్తర శతనామావళితో పూజలు జరిపారు. అనంతరం మల్లికార్జున్ స్వామి ప్రవచనం ఇచ్చారు. కార్యక్రమంలో రాజాగౌడ్, సాయిలు, తదితరులు పాల్గొన్నారు.