byసూర్య | Wed, Sep 25, 2024, 12:06 PM
జోగులాంబ గద్వాల జిల్లాలో బుధవారం పోలీసులు బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేశారు. గట్టు ఎత్తిపోతల పథకానికి కాంగ్రెస్ మంత్రులు వస్తున్న సందర్భంగా వారికి వినతి పత్రాలు ఇచ్చేందుకు బీఆర్ఎస్ నాయకులు సిద్ధమయ్యారు. ముందుగా గుర్తించిన పోలీసులు బీఆర్ఎస్ జిల్లా సమన్వయకర్త పల్లయ్య, మరి కొంతమంది నేతలను అరెస్టు చేసి గట్టు పోలీస్ స్టేషన్ కు తరలించారు.