byసూర్య | Wed, Sep 25, 2024, 12:35 PM
పటాన్చెరు నియోజికవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ న్యూ ఎంఐజీ కాలనీకి చెందిన రవి చారి గారు బ్రెయిన్ స్ట్రోక్ కు గురై చికిత్స పొంది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన విషయం తెలుసుకుని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు మంగళవారం ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా రవి చారి గారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.ఆ భగవంతుడు ఆశీస్సులతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మున్సిపల్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్,మధుసూదన్,పాండు, బిక్షపతి, మధు పంతులు, అశ్విన్, అక్రమ్,అనిల్ తదితరులు పాల్గొన్నారు.