byసూర్య | Mon, Sep 23, 2024, 04:27 PM
తెలంగాణ రాష్ట్రంలోని మహిళలు జరుపుకునే రంగుల మరియు ఉత్సాహభరితమైన పండుగ బతుకమ్మ అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. అనంతరం నిజాంపేట్ లోని శ్రీనివాస్ నగర్ నందు "స్ఫూర్తి ఉమెన్స్ గ్రూప్" ఆధ్వర్యంలో ప్రతీ యేటా నిర్వహించే బతుకమ్మ వేడుకల పోస్టర్ ను ఆదివారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్, నిజాంపేట్ కార్పొరేటర్ రాఘవేందర్ రావు తో కలిసి ఆవిష్కరించారు.
ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పువ్వులలో అమ్మవారిని చూస్తూ మహిళలంతా ఒకదగ్గర చేరి ఐకమత్యంగా ఆటలాడుతూ అమ్మవారిని కొలుస్తూ ఆడిపాడే వేడుక బతుకమ్మ అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి ఉమెన్స్ గ్రూప్ అధ్యక్షురాలు కొడారి రమాదేవి, ఉమాదేవి, శివకుమారి, గీత, పల్లవి, రమాదేవి, మంజుల, యశస్విని, రాజేశ్వరి, చందు, లక్ష్మి, భాగ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.