byసూర్య | Mon, Sep 23, 2024, 11:39 AM
ముదిరాజుల హక్కుల సాధన కోసం ఆదివారం ఉమ్మడి మెదక్ జిల్లా రామాయంపేటలో ఏర్పాటు చేసిన జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో ముదిరాజ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పాల్గొని ముదిరాజ్ ల గొంతుకను గట్టిగా వినిపించడం సంతోషంగా ఉంది.మన జాతిని చైతన్యం చేసి, మన బ్రతుకులు మార్చుకుని బానిస బ్రతుకులను అంతం చేసి భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేద్దాం.మన హక్కుల సాధనకు జాతిని ఐక్యం చేసుకుని వచ్చే స్థానిక ఎన్నికల్లో రాజకీయ పునాది వేద్దాం. రాజ్యాధికారం సాధించి హక్కుల కోసం పోరాడదాం. ముదిరాజ్ ల జాతిని బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చుకుందాం.ప్రతి ఇంటికి ప్రగతి అందించి మార్గదర్శకులుగా మిగిలిపోదాం. జాతి కోసం నిస్వార్థంగా సేవ చేద్దాం. బానిస బ్రతుకులు అంతం చేద్దాం. చీడ పురుగులను ఏరిపారేసేందుకు యువత బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిస్తున్నాను. మన ముదిరాజ్ జాతి కోసం నిస్వార్థంగా సేవ చేద్దాం.‘చలో రామాయంపేట‘ను విజయవంతం చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర నాయకత్వంతో పాటు జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులకు ధన్యవాదాలు.