తెలంగాణలో మొదటి కంటెయినర్‌ స్కూల్,,,చొరవ తీసుకున్న జిల్లా కలెక్టర్

byసూర్య | Mon, Sep 16, 2024, 07:51 PM

తాత్కాలిక నివాసాల కోసం కొందరు కంటెయినర్‌లను వినియోగిస్తారన్న సంగతి తెలిసిందే. ఫామ్‌హౌస్‌లలో, కన్‌స్ట్రక్షన్ సైట్లలో ఆఫీసులుగా ఎక్కడికంటే అక్కడికి షిఫ్ట్ చేసేందుకు ఈజీగా ఉండటంతో కంటెయినర్‌లను ఉపయోగిస్తున్నారు. కొందరు కంటెయినర్ దుకాణాలు కూడా ఏర్పాటు చేసి వ్యాపారాలు సాగిస్తున్నారు. అయితే తొలిసారిగా కంటెయినర్ స్కూల్ ఏర్పాటు చేసారు. తెలంగాణలో మెుదటిసారిగా కంటెయినర్‌లో స్కూల్ ఏర్పాటు చేసారు.


ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బంగారుపల్లి గొత్తికోయగుంపు అటవీ ప్రాంతంలో ఈ కంటెయినర్ స్కూల్ ఏర్పాటు చేశారు. స్థానిక పిల్లల కోసం ఈ ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇది పూర్తిగా అటవీ ప్రాంతం కావటంతో శాశ్వత నిర్మాణాలకు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ పర్మిషన్ ఇవ్వదు. ఈ తండాలోని పిల్లలు సౌకర్యవంతంగా లేని ఓ గుడిసెలో ఇన్నాళ్లుగా విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. ఓ టీచర్, ప్రధానోపాధ్యాయుడు మాత్రమే ఉన్నారు. వర్షం వస్తే పిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్తగా స్కూల్ నిర్మించాలని స్థానిక తండావాసులు కలెక్టర్‌ను కోరారు.


అయితే కొత్త స్కూల్ భవన నిర్మాణానికి అటవీ అధికారులు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో కలెక్టర్‌ దివాకర వినూత్నంగా ఆలోచించాడు. పర్మినెంట్ బిల్డింగ్ కాకుండా ఎక్కడికంటే అక్కడకు షిఫ్ట్ చేసే సౌకర్యం ఉన్న కంటెయినర్‌(ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌) స్కూల్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కలెక్టర్‌ తన నిధుల నుంచి ప్రత్యేకంగా రూ.13 లక్షలు ఖర్చు చేసి కంటెయినర్ స్కూల్ ఏర్పాటు చేయించాడు. పిల్లల ఉన్నత భవిష్యత్తు కోసం స్కూలుకు కొత్తరూపు ఇచ్చారు. ఇప్పటికే కంటెయినర్ స్కూల్ సిద్ధం కాగా.. వచ్చే వారంలో మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కంటెయినర్‌ స్కూల్ 25 అడుగుల వెడల్పు, 25 అడుగుల పొడవు ఉంటుంది. ఇందులో 12 వరకు డ్యూయల్‌ డెస్కులు ఉంటాయి. అలాగే ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు కూర్చోవడానికి 3 కుర్చీలు పట్టే స్థలం ఏర్పాటు చేశారు.


తొలి కంటెయినర్ హాస్పిటల్ కూడా ఇక్కడే.. ఇక ఇదే జిల్లాలో తొలిసారిగా కంటెయినర్ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం పోచాపూర్‌ గ్రామంలో స్థానిక గిరిజనులకు వైద్య సేవలం అందిచేందుకు జిల్లా కలెక్టర్ ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయించగా.. ప్రస్తుతం వారికి వైద్య సేవలు అందిస్తున్నారు. గిరిజనులు వైద్యం కోసం కి.మీ ప్రయాణించాల్సి రావటం, ఆలోపు ప్రాణాలు కోల్పోతుండటంతో జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని కంటెయినర్ హాస్పిటల్ ఏర్పాటు చేయించారు. గిరిజనుల బాధలను అర్థం చేసుకొని వారికి కావాల్సిన సౌకర్యాలను అందిస్తున్న జిల్లా కలెక్టర్‌ను పలువురు అభినందిస్తున్నారు.


Latest News
 

యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM
భజన పేరుతో.. మిరప తోటలోనే యవ్వారం పెట్టేశాడు Fri, Sep 20, 2024, 10:00 PM
తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు Fri, Sep 20, 2024, 09:56 PM