హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాలు.. నగర ప్రజలకు పోలీసుల కీలక సూచనలు

byసూర్య | Mon, Sep 16, 2024, 07:10 PM

హైదరాబాద్ వ్యాప్తంగా రేపు (సెప్టెంబర్ 17) గణనాథుల నిమజ్జనం ఉండనుంది. ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ గణేషుడి విగ్రహాలను హుస్సేన్ సాగర్ ఒడ్డున నిమజ్జనం చేయనున్నారు. అందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రేటర్ పరిధిలో గణేశ్ నిమజ్జనం కోసం దాదాపుగా 25 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ సహా నగరంలో ఉన్న ఇతర అన్ని చెరువుల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.


ఖైరతాబాద్ గణేషుడిని మధ్యాహ్నం 1 గంటకు నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. నేటి నుంచి ఖైరతాబాద్ గణేష్ తరలింపునకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. బాలాపూర్ గణేషుడిని కూడా నాలుగు గంటలలోపు నిమజ్జనం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తర్వాత వచ్చిన విగ్రహాల తరలింపు కోసం మండపాల ప్రతినిధులతో చర్చలు జరిపామని వెల్లడించారు. ఉదయం నుంచి పెద్ద ఎత్తున నిమజ్జనం జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.


ఇక నిమజ్జనానికి తరలివచ్చే హైదరాబాద్ వాసులకు పోలీసులు కీలక సూచనలు చేశారు. ప్రజలందరూ సొంత వాహనాలు కాకుండా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వాడుకోవాలని సూచించారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆర్టీసీ, ఎంఎంటీఎస్, మెట్రో ట్రైన్లను ఉపయోగించుకోవాలన్నారు. తాము సూచించిన ప్రాంతాల్లోనే పార్కింగ్ చేయాల్సి ఉంటుందన్నారు. ట్రాఫిక్‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా పలు చోట్ల ఆంక్షలు విధించినట్లు చెప్పారు.


నగరంలో గణపతి నిమజ్జనం నేపథ్యంలో రేపు ఉదయం 6 నుంచి 18న ఉదయం 8 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని రాచకొండ పోలీసులు తెలిపారు. ఇంట్రాసిటీ, ఇంటర్ సిటీ ప్రైవేటు బస్సులు, భారీ వాహనాలకు ఓఆర్ఆర్ నుంచి నగరం లోపలికి ఎంట్రీ, ఎగ్జిట్ లేదని పోలీసులు వెల్లడించారు. గణపతి నిమజ్జనాలు పూర్తయ్యే వరకు ఆర్టేరియల్ రోడ్లు, ఓఆర్ఆర్, సర్వీస్ రోడ్లలోనే ఉండాలని సూచించారు.


ప్రత్యేక బస్సులు ఏర్పాటు గ‌ణేష్ నిమజ్జనం, శోభ‌యాత్ర సంద‌ర్భంగా భ‌క్తుల రాక‌పోక‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఆర్టీసీ యాజ‌మాన్యం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ట్యాంక్‌బండ్ ప‌రిస‌ర ప్రాంతాల‌కు 600 స్పెష‌ల్ బ‌స్సుల‌ను సంస్థ న‌డుపుతోంది. గ్రేటర్ ప‌రిధిలోని ఒక్కో డిపో నుంచి 30 నుంచి 15 బస్సుల‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక బ‌స్సుల‌ను వినియోగించుకుని గ‌ణేష్ నిమజ్జనాల్లో పాల్గొనాల‌ని భ‌క్తుల‌కు ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది.


Latest News
 

యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM
భజన పేరుతో.. మిరప తోటలోనే యవ్వారం పెట్టేశాడు Fri, Sep 20, 2024, 10:00 PM
తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు Fri, Sep 20, 2024, 09:56 PM