చర్లపల్లికి నెలలోనే కొత్త రూపు.. స్టేషన్‌కు రహదారుల నిర్మాణం

byసూర్య | Mon, Sep 16, 2024, 07:07 PM

హైదరాబాద్ చర్లపల్లి కొత్తరూపు సంతరించుకోనుంది. నెల రోజుల్లోనే రూపు రేఖలు మారిపోనున్నాయి. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసారు. చర్లపల్లిలో కొత్త రైల్వే టెర్మినల్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు స్టేషన్లు ఉండగా.. వాటిపై రద్దీని తగ్గించేందుకు, జిల్లాలకు వెళ్లే రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం చర్లపల్లి రైల్వే టెర్మినల్ నిర్మించారు. అయితే ఈ స్టేషన్ రోడ్డు కనెక్టివిటీకి ప్రస్తుతం ఇబ్బందులు ఉండగా.. అవి త్వరలోనే తీరిపోనున్నాయి. రెండు రోడ్డు అభివృద్ధి ప్రణాళికలను(ఆర్‌డీపీ) జీహెచ్‌ఎంసీ రూపొందించింది. తాజాగా ఆ డీపీఆర్‌లను కమిషనర్‌ ఆమ్రపాలి సీఎం రేవంత్‌ దృష్టి తీసుకెళ్లారు. భూసేకరణకు అడ్డంకులు తొలగటం, వాటికి రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో రోడ్ల నిర్మాణానికి వేగంగా అడుగులు పడ్డాయి.


చర్లపల్లి రైల్వే స్టేషన్‌ ముందు మూడు ప్రధాన ద్వారాలను నిర్మించాలని జీహెచ్‌ఎంసీ ప్రణాళికలు రచిస్తోంది. 100 అడుగుల వెడల్పుతో రెండు, 80 అడుగుల రోడ్డుతో మరో ద్వారం నిర్మించనున్నారు. ఈ ద్వారాలను 100 అడుగుల రోడ్డుతో కనెక్ట్ చేయనున్నారు. ఈ రోడ్లను నెల రోజుల వ్యవధిలోనే నిర్మించాలని అధికారులకు సీఎం రేవంత్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఇక రోడ్డుకు సమీపంలో పార్కింగ్‌ కేంద్రాలు, బస్టాండు, ఆటో స్టాండ్‌ల నిర్మాణానికి ఓపెన్ ఫ్లేస్ కూడా వదిలేస్తారు. 100 అడుగుల రోడ్డు కోసం ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ 3 ఎకరాల భూమిని జీహెచ్‌ఎంసీకి ఇవ్వనుంది. ఇతర రోడ్లకు 6-7 ఎకరాల పరిశ్రమలశాఖ భూమిని ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు.


స్టేషన్‌ వెనకాలే కొన్ని నివాస సముదాయాలు ఉండగా.. వాటిని తొలగించి 80 అడుగుల రోడ్డు నిర్మించనున్నారు. మొత్తంగా రూ.35 కోట్ల అంచనా వ్యయంతో చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు కొత్త రోడ్లు నిర్మించనున్నారు. రోడ్లు పూర్తయ్యాక స్టేషన్‌ ముందు మరింత భూసేకరణ చేపట్టి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ మెరుగుపరించేదుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. భవిష్యత్తులో ఇక్కడున్న కొన్ని పరిశ్రమలు బయటకు వెళ్లాక మరో 200 ఎకరాల వరకు భూమి తెలంగాణ ప్రభుత్వానికి అందనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.


ఇక ఎయిర్‌పోర్టును తలదన్నేలా చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను నిర్మిస్తున్నారు. స్టేషన్‌లో మొత్తం 9 ఫ్లాట్‌ఫామ్‌లు, రెండు పెద్ద ఎఫ్‌వోబీలు, రిజర్వేషన్, టికెట్‌ కౌంటర్లు, ఆరు ఎస్కలేటర్లు, ఏసీ, నాన్‌ఏసీ విశ్రాంతి గదులు, ఫుడ్ కోర్టులు, విడిది కేంద్రాలతో స్టేషన్‌ను దాదాపు 100 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి కొత్త స్టేషన్‌ నగర ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే అక్కడ 13 జతల ట్రైన్లు ఆగుతుండగా.. భవిష్యత్తులో మరో 45 జతల కొత్త ట్రైన్లు రాకపోకలు సాగించనున్నాయి.


Latest News
 

యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM
భజన పేరుతో.. మిరప తోటలోనే యవ్వారం పెట్టేశాడు Fri, Sep 20, 2024, 10:00 PM
తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు Fri, Sep 20, 2024, 09:56 PM