byసూర్య | Thu, Jul 11, 2024, 02:28 PM
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని గురువారం నారాయణపేట పట్టణంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆర్డీవో కార్యాలయం వద్ద జిల్లా వైద్య శాఖ అధికారి సౌభాగ్యలక్ష్మి జండా ఊపి ప్రారంభించారు. వీరసావర్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. సౌభాగ్యలక్ష్మి మాట్లాడుతూ. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలలో భారతదేశం రెండవ స్థానంలో ఉందని, జనాభాకు తగ్గ వనరులు లేవన్నారు. జనాభా నియంత్రణకు కృషి చేయాలన్నారు.