byసూర్య | Thu, Jul 11, 2024, 12:28 PM
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు రంగారెడ్డి జిల్లా వేదిక కాబోతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం ఉదయం 10 గంటలకు శంషాబాద్ లోని మల్లిక కన్వెన్షన్లో నిర్వహించే ఈ సమావేశాలకు కేంద్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ధర్మంద్ర ప్రధాన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.