byసూర్య | Thu, Jul 11, 2024, 12:00 PM
హైదరాబాద్ సచివాలయంలో రాష్ట్ర రోడ్డు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని స్టేషన్ ఘాన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పలు అభివృద్ది పనులపై వారికి వినతిపత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించి త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.