byసూర్య | Thu, Jul 11, 2024, 11:58 AM
పర్యావరణ పరిరక్షణలో ప్రతిఒక్కరూ బాగస్వామ్యులు కావాలని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆయన వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని ఎన్ఆర్ వెంచర్ పార్కు స్థలంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతి, వైస్ చైరప ర్సన్ మంగతో కలిసి మొక్కలు నాటారు. నాటిన ప్రతీ మొక్క బతికించే బాధ్యత ఈ మున్సిపల్ కమిష నర్, సిబ్బందిపై ఉందన్నారు.