byసూర్య | Tue, Jul 09, 2024, 01:48 PM
ఉప్పల్ మునిసిపల్ కార్యాలయంలో ఉప్పల్ మండలానికి చెందిన 141 కల్యాణ లక్ష్మి, షాది ముభారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొని లబ్ధదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చెక్కుల పంపిణీ కార్యాలయం పారదర్శకంగా జరగాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా లక్ష నూట పదహారు రూపాయల తో తులం బంగారం ఇవ్వాలి అని ఆయన అన్నారు.