byసూర్య | Tue, Jul 09, 2024, 01:49 PM
ఆషాడమాసం పురస్కరించుకొని జోగిపేట పట్టణంలోని ముత్యాలమ్మ దేవాలయంలో మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో శాకాంబరి రూపంలో ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారికి మంగళహారతులు, మహా నైవేద్యాన్ని సమర్పించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.