byసూర్య | Tue, Jun 25, 2024, 03:26 PM
నారాయణపేట పట్టణంలో రేపు అనగా బుధవారం ఎస్ ఆర్ ఫంక్షన్ హాలులో జరిగే భూ సదస్సును విజయవంతం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాలప్ప, గోపాల్ అన్నారు. మంగళవారం మరికల్ మండల కేంద్రంలోని 449 సర్వే నంబర్ లోని ప్రభుత్వ భూములు సాగు చేస్తున్న రైతులతో మాట్లాడారు. సమస్యను అడిగి తెలుసుకున్నారు. భూ సదస్సులో పాల్గొని సమస్యలు సభ దృష్టికి తేవాలని అన్నారు. నాయకులు, రైతులు పాల్గొన్నారు.