byసూర్య | Tue, Jun 25, 2024, 03:24 PM
ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవి ఎంపీలుగా మంగళవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. డీకే అరుణ 1994లో టీడీపీ నుంచి, 2019లో బీజేపీ నుంచి ఎంపీగా పోటీచేసి ఓటమి చెందారు. తాజా ఎన్నికలలో గెలుపొందిన అరుణ(బీజేపీ) తొలిసారి పార్లమెంట్లో కాలు పెట్టబోతున్నారు. అటూ 1991, 96లో రెండుసార్లు ఎంపీగా పనిచేసిన మల్లు రవి. 3వ సారి లోక్ సభలో ప్రమాణస్వీకారం చేయనున్నారు.