byసూర్య | Tue, Jun 25, 2024, 03:29 PM
సచివాలయ కార్యాలయం మంగళవారం నిర్వహించిన రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి రఘునాథరావు, డైరెక్టర్ గోపి పాల్గొన్నారు. రైతుల నుంచి రైతు భరోసా అంశంపై అభిప్రాయాలను స్వీకరించారు. వ్యవసాయ చేస్తున్న రైతులకు, పది ఎకరాలకు మించకుండా ప్రతి ఒక్కరికీ రైతు భరోసా ఇవ్వాలని సూచించారు. కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ భూములకు రైతు భరోసా ఇవ్వకూడదన్నారు.