byసూర్య | Tue, Jun 25, 2024, 03:14 PM
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 26న పాఠశాలల బంద్ కు ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందని ఏబీవీపీ మండల నాయకులు మల్లేష్ యాదవ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభమై 15 రోజులు గడుస్తున్న పాఠ్య పుస్తకాలు యూనిఫామ్స్ పంపిణీ చేయలేదని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలో ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.