byసూర్య | Tue, Jun 25, 2024, 03:11 PM
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం పరిధిలోని శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. త్వరలోనే గతంలో అగ్ని ప్రమాదం జరిగి పనిచేయకుండా పోయిన మూడవ యూనిట్ మరమ్మత్తుల కోసం టెండర్లు పిలుస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టు అతి ముఖ్యమైందని దీని రక్షణకు చర్యలు చేపడతామని అన్నారు.