byసూర్య | Tue, Jun 25, 2024, 03:09 PM
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీకి చెందిన ముగ్గురు బిఆర్. ఎస్ పార్టీ నుంచి ఎన్నికైన కౌన్సిలర్లు టగరం శ్రీను, సోమ్లా నాయక్, గడ్డం రమేష్ సోమవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.