byసూర్య | Tue, Jun 25, 2024, 03:06 PM
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని గోమతి సెయింట్ జోసెఫ్ ప్రైవేట్ పాఠశాలను సోమవారం విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు విక్రయిస్తున్నారని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ధర్నా నిర్వహించింది. ఆ సంఘం నాయకులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాఠశాలను సీజ్ చేశారు.