byసూర్య | Tue, Jun 25, 2024, 03:04 PM
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మదనాపురం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ శేఖర్ రెడ్డి వివరాల ప్రకారం. వనపర్తి జిల్లా అజ్జకొల్లు గ్రామానికి చెందిన సత్యం(24) ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సత్యం, రాములు, శేఖర్ అనే మిత్రులతో కలిసి ఏదో పని ఉందని రామన్ పాడు వెళ్లాడు. రామన్ పాడు నుండి అజ్జకొల్లు గ్రామానికి వెళ్తుండగా. బైకు అదుపుతప్పి అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.