byసూర్య | Tue, Jun 25, 2024, 02:58 PM
నీట్ పరీక్ష నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేసి నిర్వహణ బాధ్యతలను ఆయా రాష్ట్రప్రభుత్వాలకు అప్పగించాలని బీఎస్పీ జోగులాంబ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జ్ రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మల్దకల్ మండల కేంద్రంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ. నీట్ నిర్వహణ ప్రక్రియలో జరిగిన అవకతవకలకు కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలన్నారు. 24లక్షల మంది జీవితాలు ఆగమయ్యాయని మండిపడ్డారు. గోవిందు, రాజు పాల్గొన్నారు.