byసూర్య | Tue, Jun 25, 2024, 02:40 PM
ఎస్ఆర్ నల్లగొండ బ్రాంచ్ విద్యార్థులు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. సోమవారం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సప్లిమెంటరీ ఫలితాల్లో ఎస్ఆర్ విద్యార్థులు 25 మంది కి పైన 460పైన మార్కులు సాధించి సత్తా చాటారు. మొదటి సంవత్సరo ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను తారక్రామ్ 468, సాత్విక రెడ్డి 467, ఆశ శ్రీ 466, నేహ 466, భావన 466, నీలిమ 466 సాధించారు.