byసూర్య | Mon, Jun 24, 2024, 09:27 AM
సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామ శివారులో పేకాట ఆడుతున్న 13 మంది జూదరులను ఆదివారం సత్తుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ. 21, 500 నగదుతో పాటు మూడు బైక్ లు, నాలుగు సెల్ ఫోన్లు స్వాదీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కిరణ్ తెలిపారు. జూదాల వల్ల సులభంగా డబ్బులు సంపాదించాలని ఆశపడి భారీగా నష్టపోతున్నారన్నారని, ఎక్కడైనా పేకాట అడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.