byసూర్య | Wed, Jun 19, 2024, 05:25 PM
నసురుల్లాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని వార్తలను ఖండించకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నందు పటేల్, నారా గౌడ్, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.