byసూర్య | Wed, Jun 19, 2024, 05:27 PM
కామారెడ్డి మండలం తిమ్మక్పల్లి గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో శేఖర్ అనే వ్యక్తి తన తల్లిదండ్రులతో గొడవపడ్డారు. గొడవను అడ్డుకోవడానికి ఇంటి పక్కన గల నారాయణ, లక్ష్మి, రాజు అనే వ్యక్తులు వెళ్లారు. లక్ష్మి అనే మహిళ తలపై శేఖర్ కోపంతో ఇటుకతో దాడి చేశాడు. తలకి తీవ్రంగా తగలడంతో లక్ష్మి మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.