byసూర్య | Tue, Jun 18, 2024, 04:03 PM
నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై న్యాయవిచారణ జరిపించాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ నీట్ పరీక్షలో అవకతవకలపై ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.