byసూర్య | Tue, Jun 18, 2024, 04:00 PM
నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకల దృష్ట్యా పరీక్షను రద్దు చేయాలని తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక రాష్ట్ర కార్యదర్శి చిప్పకుర్తి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్ కావడంతో లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా నీట్ పరీక్షను రద్దు చేసి అవకతవకలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.