byసూర్య | Tue, Jun 18, 2024, 03:58 PM
మంచిర్యాల డీసీపీగా ఎ. భాస్కర్ నియామకమయ్యారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల ఐపీఎస్ అధికారులకు స్థానచలనం జరిగాయి. ఇందులో భాగంగా మంచిర్యాల డీసీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అశోక్ కుమార్ జగిత్యాల ఎస్పీగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో తెలంగాణ యాంటీ నార్కొటిక్ బ్యూరో ఎస్పీగా పనిచేస్తున్న ఎ. భాస్కర్ మంచిర్యాల డీసీపీగా రానున్నారు.