byసూర్య | Tue, Jun 18, 2024, 03:53 PM
కొమరం భీం జిల్లా సిర్పూర్ (టి) గ్రామపంచాయతీ పరిధిలోని దుబ్బగూడా కాలనీకి చెందిన ఎల్ములే వరలక్ష్మి (12) ఇంట్లో ఉన్న కూలర్ తగిలి విద్యుత్ షాక్ తో మృతి చెందింది. విద్యార్థిని సిర్పూర్ లోని కస్తూర్బా పాఠశాలలో చదువుతోంది. ఎల్ములే గజానన్ కు నలుగురు సంతానం కాగా వరలక్ష్మి మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.